దేశభక్తిని రగిల్చిన జవాన్…

240
Sai Dharam Indipendence day special
- Advertisement -

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.  గతంలో విడుదలైన జవాన్‌ ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్‌,ఫస్ట్‌ లుక్ పోస్ట‌ర్ కి చాలా మంచి స్పంద‌న రాగా తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జవాన్‌ న్యూ లుక్‌ని విడుదల చేశారు.

జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా’.. అంటూ సాయి ధరమ్ తేజ్ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాడు. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో దేశం కోసం పిడికిలి బిగించి.. జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా అంటూ రెపరెపలాడేలాడే మన జాతీయ జెండాకు సలాం చేస్తున్నట్లు ఉన్న ‘జవాన్’ పోస్టర్‌ ప్రతి పౌరుడిలో దేశభక్తిని రగిల్చేదిగా ఉంది.ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుంది.

‘కొంతమంది మనుషులు కలిస్తే కటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశం భక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత’ అంటూ ఇటీవల ‘జవాన్‌’ టీజర్‌తో ఆకట్టుకున్న ధరమ్ తేజ్ మరోసారి ‘జవాన్’ పోస్టర్‌‌తో మూవీపై అంచనాలు పెంచేశాడు.

- Advertisement -