సినీ లోకంలో నేటి విషాదాలు

49
- Advertisement -

సినీ లోకంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలుగు సీనియర్ నటుడు శరత్ బాబుతో పాటు హాలీవుడ్ నటుడు, ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో స్కాట్ దొరగా నటించి మెప్పించిన రే స్టీవెన్‌సన్ కూడా రీసెంట్ గా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఐతే, ఈ విషాదాలు మర్చిపోక ముందే.. ఈ రోజు కూడా సినీ లోకంలో మరో మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ సింగర్ టీనా టర్నర్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్’తో ఆమెకు ఎంతో గొప్ప పేరొచ్చింది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ సమీపంలోని కుస్నాచ్ట్‌లోని తన ఇంట్లో అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. గత కొంత కాలంగా క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధితో టీనా టర్నర్ బాధపడుతుందన్నారు. కాగా టీనా టర్నర్ మొత్తం ఎనిమిది గ్రామీ అవార్డుల్లో ఆరింటిని గెలుచుకుంది. టీనా టర్నర్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇక రెండో విషాదం విషయానికి వస్తే.. భోజ్‌పురి చిత్ర దర్శకుడు సుభాష్ చంద్ర (60) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. వారణాసిలోని ఓ హోటల్‌లో ఇవాళ శవమై కనిపించాడు. ‘దో దిల్ బంధే ఏక్ డోరీ సే’ సినిమా కోసం షూటింగ్ నిమిత్తం గత 11 రోజులుగా 40 మంది సభ్యులతో రాబర్ట్స్‌గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్‌‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే హోటల్‌లో ఇవాళ బెడ్‌పై మృతదేహం పడి ఉండడం చూసి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.

Also Read:బిచ్చగాడు 3… విజయ్ క్లారిటీ!
మూడో విషాదం.. గుప్పెడంత మనసు సీరియల్‌ హీరో ముకేశ్‌ గౌడ (రిషి) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తను పంచప్రాణాలుగా భావించే తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన ముఖేశ్‌ షూటింగ్‌ మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా, పక్షవాతం వచ్చి కదల్లేని స్థితిలో ఉన్న తండ్రిని అన్నీ తానై చూసుకుంటున్నానని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముకేశ్ తెలిపారు. మా నాన్నను కొడుకులా చూసుకునే అదృష్టం కలిగిందని తను ఎమోషనల్ అయ్యారు. కానీ అంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం. మా ‘ గ్రేట్ తెలంగాణ.కామ్ తరఫున ఈ రోజు మరణించిన సినీ ప్రముఖుల మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

- Advertisement -