సీజన్, సీజన్కూ ప్రజాదరణ పెంచుకుంటు ఇటు ప్రేక్షకులకు ఆటవిడుపును కలిగిస్తు ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది ప్రొ కబడ్డీ లీగ్ .ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన వేలంలో ప్రాంఛైజీలు ఆటగాళ్లపై లక్షలు కురిపించారు. ఈ సీజన్లో గుజరాత్, హరియాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్కి చెందిన నాలుగు జట్లు కొత్తగా లీగ్లో చేరాయి. దీంతో లీగ్లో పాల్గొన్న జట్ల సంఖ్య ఎనిమిది నుంచి 12కి పెరిగింది.
తమిళనాడు జట్టుకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, నిమ్మగడ్డ ప్రసాద్ యజమానులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సచిన్ తన జట్టు పేరును ప్రకటించాడు. ట్విటర్ వేదికగా సచిన్ తాను కొనుగోలు చేసిన తమిళనాడు జట్టు పేరు ‘తమిళ్ తలైవాస్’గా నామకరణం చేసినట్లు పేర్కొన్నాడు. నా కొత్త జట్టు పేరును ప్రకటించేందుకు ఎంతో గర్వపడుతున్నా అని సచిన్ తెలిపాడు. తమిళ్ తలైవాస్ జట్టుకి భాస్కరన్ కోచ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. జేఎస్డబ్ల్యూ గ్రూప్కు చెందిన హరియాణా జట్టుకు ‘హరియాణా స్టీలర్స్’, అదానీ గ్రూప్కు చెందిన గుజరాత్ ఫ్రాంచైజీ జట్టుకు ‘గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్’గా నామకరణం చేశారు.
జులై 28న ప్రారంభమయ్యే పీకేఎల్-5వ సీజన్ అక్టోబరు 28తో ముగియనుంది. ఈ సీజన్లో 12 జట్ల మధ్య సుమారు 130 మ్యాచ్లు జరగనున్నాయి.