27న ‘సాక్ష్యం’తో వస్తున్న సాయి శ్రీనివాస్‌..

263
- Advertisement -

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జులై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందింది.

Saakshyam Movie

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది..ముఖ్యంగా 12 నిమిషాల పంచభూతలు సాంగ్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో హీరో సాయి శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ లో స్టన్నింగ్ లుక్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు.

హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనాలు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -