తప్పు చేసి…. తప్పించుకోలేరు

239
Saakshyam Official Teaser
- Advertisement -

జయ జానకి నాయక సక్సెస్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న చిత్రం ‘సాక్ష్యం’. శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం అమెరికాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఈ భూమి మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరు నాలుగు దిక్కులు వెతికి …ఎవ్వరు చూడలేదనుకుంటారు కానీ పైనుంచి 5వ దిక్కు ఒకటి ఎప్పటికి మనల్ని చూస్తునే ఉంటుంది. అదే కర్మ సాక్ష్యం దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదంటూ చెప్పే టీజర్ కొత్తగా ఉంది. నిజానికి, అబద్దాలకు, రహాస్యాలకు అన్నింటికి సాక్ష్యం అంటూ ముగిసే ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్‌గా ట్రైలర్‌ని తీర్చిదిద్దారు .

శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మే రెండో వారంలో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జ‌రుపుకుంటుంది. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వర్ చిత్రానికి సంగీతం అందించ‌గా, సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అందించారు.

- Advertisement -