అన్నదాతల ఖాతాల్లోకి 8వ రోజు ‘రైతుబంధు’

102
rythu bandhu
- Advertisement -

రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. 8వ రోజు 86,662 మంది రైతుల ఖాతాల్లో రూ.514.88 కోట్లు జమ కానున్నాయి. ఇప్పటి వరకు 60.57 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.7,178.67 కోట్లు ఆయా అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేసింది ప్రభుత్వం.

ఈ నెల 15 నుండి రైతు బంధు పంపిణీ ప్రారంభంకాగా తొలుత ఎకరం నుండి ప్రారంభమై 25 వరకు ఎకరాల వారిగా నగదు జమచేయనున్నారు. వానాకాలం సీజన్‌లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఎకరానికి రూ.5వేల చొప్పన సాయం నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేస్తోంది సర్కార్.

- Advertisement -