‘ఆర్ఎక్స్ 100’ కథ ముందు ఆ హీరోకి వినిపించారట..!

201
rx100_
- Advertisement -

తాజాగా కుర్రకారును ఆకట్టుకుంటున్న చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజే రెట్టింపు వసూళ్లు సాధించినట్లు చెబుతున్నారు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కెమిస్ట్రీ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలించిందని టాక్. అయితే తాజాగా ఈసినిమాకి సంబంధించిన మరో ఆసక్తి కర విషయం, ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.

Sudheer-Babu

కార్తికేయ కంటే ముందు ఈ కథను హీరో సుధీర్ బాబుకు వినిపించినట్లు సమాచారం. కానీ కథ వినిపించి మూడు నెలలు గడిచినా.. సుధీర్ బాబు నుంచి ఎలాంటి స్పందినలేకపోవడంతో, అజయ్ భూపతి కార్తికేయకు వినిపించగా, ఓకే చేశాడట. సుధీర్ బాబు ఆ కథకి ఓకే చెప్పి ఉంటే.. కార్తికేయ మంచి హిట్ మిస్పైపోయేవాడని అంటున్నారు. సమ్మోహనం తరువాత వెంటనే మరో హిట్ ని తన ఖాతాలో వేసుకునే వాడని అనుకుంటున్నారు. ఏమైనా.. సుధీర్ బాబు ఓ మంచి హిట్ మూవీ మిస్సైయ్యాడని ఫిలిం ప్రేక్షకుల టాక్.

మరోవైపు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానల్స్ పోటీపడుతున్నాయట. దానికి తగ్గట్టుగానే నిర్మాత కూడా 6 కోట్ల వరకూ చెబుతున్నాడట. యూత్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని కొంచెం అటు, ఇటు అయినా.. సినిమా హక్కులను దక్కించుకునేందుకు టీవీ చానల్స్ సిద్దంగా ఉన్నాయట. మొత్తానికి ఆర్ఎక్స్ 100 భారీ మొత్తంలో లాభాలు ఆర్జించిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -