శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్‌ పాయల్ రాజ్ పుత్..

116
- Advertisement -

RX 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న పాయల్ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా పాయల్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని.. ఇలాంటి ప్రదేశంకు రావడం సంతోషంగా వుందని పాయల్ చెప్పారు. తెలుగులో రెండు చిత్రాలతో పాటు పలు భాషల్లో నటిస్తున్నానని ఆమె తెలిపింది.

- Advertisement -