భారతీయులు గొప్పోళ్లు..పుతిన్ ప్రశంస

459
- Advertisement -

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ భారతదేశ ప్రజలపై ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని అభివృద్ధిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సామర్థ్యం ప్రతిభ సమర్థత విజయకాంక్ష ఉంటాయని అన్నారు. భారతీయుల్లో తమ సామర్థ్యం కంటే ఏక్కువ పనులు చేసి ఇతరుల మేలు కోసం పాటుపడతారని కీర్తించారు. నవంబరు4న రష్యన్‌ యూనిటీ డే సందర్భంగా ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.

ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలం నుంచి సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.  మనం భారత దేశాన్ని చూద్దాం. అంతర్గత అభివృద్ధి కోసం విజయకాంక్షగల గొప్ప ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఆ దేశాభివృద్ధిలో కచ్చితంగా అద్భుత ఫలితాలు వస్తాయి. సందేహాలేవీ అక్కర్లేదు. దాదాపు 150 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ఇప్పుడు అదే సత్తా అని పుతిన్ చెప్పారు.

మేధావులతో కూడిన వాల్డాయ్ క్లబ్ ప్లీనరీ సమావేశాల్లోపుతిన్‌ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను, భారత దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. ఎస్‌ జైశంకర్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. భవిష్యత్తు భారత దేశానిదేనని కూడా అన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా భారత్ పాత్ర పెరుగుతుందని కూడా చెప్పారు.

ఇవి కూడా చదవండి..

టీ హబ్‌కు ఏడేళ్లు…

1952నాటి తొలి ఓటరు నేగీ కన్నుమూత

ఏపీలో కేసీఆర్ వ్యాఖ్యల కలకలం

- Advertisement -