డ్రగ్స్ కేసు.. ఆ నటి పై బోలెడు రూమర్లు

30
- Advertisement -

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ కు కొచ్చి NIA అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి పీఏగా పని చేసిన ఆదిలింగం ‘కేరళ విలన్జియం’ సమీపంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసిన అధికారులు.. డ్రగ్స్ సరఫరా లో వచ్చిన మొత్తాన్ని నిందితుడు సినీ పరిశ్రమలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. కాగా.. అతనికి సంబంధించిన వివరాల కోసం విచారించేందుకు వరలక్ష్మికి సమన్లు జారీ చేశారు. అయితే, వరలక్ష్మి శరత్ కూడా డ్రగ్స్ కి అలవాటు పడింది అని, ఆమె బ్యాగ్ లో నిత్యం డ్రగ్స్ ఉంటాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఐతే డ్రగ్స్ కేసులో తనకు NIA నోటీసులు పంపడం పై.. అలాగే తన పై వస్తున్న వార్తలకు వరలక్ష్మీ సమాధానం చెపింది. వరలక్ష్మీ మాట్లాడుతూ.. తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. తనకు NIA ఎలాంటి నోటీసులు పంపించలేదని పేర్కొంది. ఆదిలింగం తన దగ్గర మేనేజరుగా పనిచేసి మూడేళ్ల క్రితమే పని మానేశాడని ఆమె వెల్లడించింది. అతనికి తనకు ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ కేసుకు సంబంధించి అధికారులకు తప్పకుండా సహకరిస్తానని పేర్కొంది. ఈ క్రమంలోనే ఆదిలింగం – వరలక్ష్మి శరత్ కుమార్‌ ల గురించి ఓ రూమర్ బయటకు వచ్చింది.

వరలక్ష్మి శరత్ కుమార్‌ తో ఆదిలింగం మిస్ బిహేవ్ చేస్తూ ఉండేవాడని.. కొన్ని సినిమా సెట్స్ లో కూడా నేరుగా అతను వరలక్ష్మి శరత్ కుమార్‌ కేరవ్యాన్ లోకి వెళ్లి గంటల తరబడి ఉండేవాడు అని, అలాగే ఆమె విదేశాల్లో షూట్ కి వెళ్తే.. ఆదిలింగం కూడా వెళ్ళేవాడు అని, పైగా వరలక్ష్మి శరత్ కుమార్‌ రూమ్ లోనే ఆదిలింగం కూడా ఉండేవాడు అని.. ఏం లేకపోతే ఒక మేనేజర్ కి ఆమె ఎందుకు అంత అవకాశం ఇస్తోంది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, పైగా ఆమె పై బోలెడు రూమర్లు రావడం ఆశ్చర్యకరం.

Also Read:షర్మిల చివరి ప్రయత్నం..ఫలిస్తుందా?

- Advertisement -