ఖమ్మం కాంగ్రెస్‌లో బీసీ చిచ్చు..

34
- Advertisement -

ఖమ్మం కాంగ్రెస్‌లో బీసీ చిచ్చు రాజుకుంది. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించాలని సీనియర్ నేత వీ హనుమంతరావు తెలిపారు. ఇక వీహెచ్‌ మాట్లాడుతుండగా అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ వేదికపై సీఎల్పీ నేత భట్టితో పాటు రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

తన ప్రసంగానికి అడ్డుతగలడంపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు.తనను మాట్లాడనివ్వకపోవడంతో మైక్ విసిరి నిరసన తెలిపారు. ఇక కొంతసేపటి తర్వాత భట్టి విక్రమార్క జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ఇక కొంతకాలంగా పొన్నాల, వీహెచ్‌ వంటి నేతలు జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ బీసీ గళం వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది.

Also Read:Telangana BJP:సీట్ కోసం జయసుధ పాట్లు

- Advertisement -