కార్మికులను నాయకులు రెచ్చగొడుతున్నారుః ఎర్రబెల్లి

333
errabelli dayakar
- Advertisement -

ఆర్టీసీ కార్మికులను బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు రెచ్చగొడుతున్నారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై నేడు మీడియాతో మాట్లాడారు మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే ఆర్టీసీ కార్మికుల వేతనాలు తెలంగాణలో మెరుగ్గా ఉన్నాయన్నారు.

ఆర్టీసీని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్‌ భారీగా నిధులు ఇచ్చారన్నారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీకి రూ.3,303 కోట్లు సహాయం చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ప్రచారం చేసి కార్మికులను రెచ్చగొడుతున్నరన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని మంత్రి ప్రశ్నించారు.

- Advertisement -