సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసి ఉద్యోగులు..

358
kcr
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఆర్టీసీ ఉద్యోగులు పాలాభిషేకం చేస్తున్నారు. ఆర్టీసి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచుతూ సిఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల ఆర్టీసి డిపో ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆర్టీసి ఉద్యోగులు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. సీఎం తమకిచ్చిన హామీలు నెరవేర్చడం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు.

- Advertisement -