దుబ్బాక మున్సిపాలిటీకి రూ. 20 కోట్లు మంజూరు..

129
ktr minister
- Advertisement -

దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు మంత్రి కేటీఆర్. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి మేరకు రూ. 20 కోట్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ మరియు పాలకవర్గం మంత్రి కేటీఆర్‌ని కలిసి అభినందనలు తెలిపారు.

దుబ్బాక మీద సీఎం కేసీఆర్‌ కి ఉన్న ప్రత్యేక ప్రేమతో,దుబ్బాక మున్సిపల్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దుబ్బాక అభివృద్ధి అనేది కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డి కే సాధ్యం అన్నారు. మాయ మాటలు మాత్రమే చెప్పే నాయకులతో ఏమీ కాదు,
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ నిధులతో దుబ్బాక మున్సిపాలిటీ అనేది అభివృద్ధి లో ముందుంటుందన్నారు.

- Advertisement -