బ్యాంకు అకౌంట్లు లేనివారికి త్వరలో రూ.1500 సాయం..

292
ktr
- Advertisement -

కరోనా విపత్తు సహాయం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు రు.1500 ఆర్థిక సాయం ఇస్తోంది తెలంగాణ సర్కారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు కరోనా విపత్తు వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు కొంచెం సాంత్వనగా ఉండాలని మంగళవారం నుండి తెల్ల రేషన్ కార్డుదారుల బ్యాంక్ అకౌంట్లో రు.1500 జమ చేయడం మొదలైంది.

దీని కొరకు రు 1111,12,29,000 (పదకొండు వందల పదకొండు కోట్ల పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు) రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తం తెల్ల రేషన్ కార్డుదారుల్లో సుమారు 74 లక్షల కార్డుదారులకు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి కావున వారికి తొలివిడతలో ఈ మొత్తం ఇవ్వాళ, రేపట్లో డిపాజిట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి ఎలా ఇవ్వాలో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదే. ఇందులో ఎవరి వాటాలు లేవు!

- Advertisement -