RRR సెకండ్‌ షెడ్యూల్ ప్రారంభం..

229
- Advertisement -

బాహుబ‌లి తర్వాత డైరెక్టర్ రాజ‌మౌళి ప్ర‌స్తుతం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ క్రేజీ కాంబోలో RRR చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ మూవీ రెండో షెడ్యూల్ సోమవారం నుంచి మొదలైంది. ఈ విష‌యాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఇకపై నిర్విరామంగా దీని కోసం వర్క్ చేయబోతున్నారు.

అందరూ బాహుబలి తరహాలో ఇది కూడా విపరీతంగా ఆలస్యం అవుతుందని భావిస్తున్న నేపధ్యంలో ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ ఒక్క ఏడాదిలోనే షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా జక్కన్న ఫుల్ ప్లానింగ్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని పిరియాడిక‌ల్ నేప‌థ్యంలో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడ‌ని స‌మాచారం.

RRR

స్వాతంత్య్ర పోరాటం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా.. రామ్ చరణ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారని అంటున్నారు. మ‌రో క‌థ‌నం ప్ర‌కారం ఆర్ఆర్ఆర్‌లో చెర్రీ, ఎన్టీఆర్‌లు స్నేహితులుగా ఉంటార‌ని, స్వాతంత్య్ర పోరాటం స‌మ‌యంలో చ‌నిపోయిన వీరు మ‌ళ్ళీ జ‌న్మిస్తార‌ని చెబుతున్నారు. అయితే క‌థ సంగ‌తి ఎలా ఉన్న‌ప్ప‌టికి చిత్రానికి మాత్రం ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తార‌ని అంటున్నారు.

సెకండ్ షెడ్యూల్ పూర్తవగానే రాజమౌళి తన సినిమా టైటిల్‌ను వెల్లడిస్తారని స‌మాచారం. ఇందులో బాలీవుడ్‌ భామ అదితి రావు హైదరిని ఓ కథానాయికగా ఎంపికచేసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -