జబర్ధస్త్ లో కొత్త జడ్జ్ కోసం రోజా సలహా

675
posani-jabardasth-
- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షో గత ఏడు సంవత్సరాలుగా సక్సెస్ పుల్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో వల్ల చాలా మంది కమెడీయన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జబర్ధస్త్ షో ఇంత పాపులర్ కావడానికి ముఖ్య కారణం జడ్జ్ లు రోజా, నాగబాబు కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. అయితే ఇటివలే జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాగబాబు జబర్ధస్త్ నుంచి వెళ్లిపోయారు. జీ తెలుగులో అదిరింది అనే కొత్త షోకు జడ్జ్ గా చేస్తున్నారు. నాగబాబుతో పాటు మరోక నలుగురు టీం లీడర్స్ ను అదిరింది షోకు తీసుకెళ్లారు. నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిన తర్వాత ఆ ప్లేస్ ను ఇంకా రిప్లేస్ చేయలేదు.

అసలు విషయం ఏంటంటే నాగబాబు వెళ్లిన తర్వాత జబర్ధస్త్ రేటింగ్స్ తగ్గుతాయని భావించారు…కానీ అప్పటి కంటే ఎక్కువ రేటింగ్స్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.. కొన్ని రోజులుగా అలీ కూర్చోగా, గత రెండు ఎపీసోడ్ ల నుంచి పోసాని కృష్ణమురళి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ జడ్జ్ విషయంలో రోజా మల్లెమాల బృందానికి ఓ సలహా ఇచ్చిందట. పోసాని కృష్ణమురళిని పర్మినెంట్ జడ్జ్ గా నియమించమని చెప్పిందట. పోసాని కృష్ణ మురళి వైసీపీ కావడంతో రోజా రికమెండ్ చేసినట్లు తెలుస్తుంది. జబర్ధస్త్ యాజమాన్యం రోజా మాట వింటారో లేదో తెలియాంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.

- Advertisement -