పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి రోజా

5
- Advertisement -

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మాజీ మంత్రి రోజా.తాను ఏ పార్టీ మారడం లేదు…పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రోజా. అనంతరం మాట్లాడిన ఆమె..గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం అన్నారు. జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్లు.ముచ్చుమర్రిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదు అన్నారు.

ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్లలేదు అన్నారు. 2014-19 మధ్యలో కూడా చాలా మంది పార్టీ మారారు,పార్టీ మారడం వల్ల జగన్ కు, వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు అని తేల్చిచెప్పారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరు అన్నారు.

Also Read:విజయవాడ సీపీని కలిసిన జెత్వానీ..

- Advertisement -