కేటీఆర్ అంటే గుండెల నిండా అభిమానం..

281
- Advertisement -

రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ యువతకు ఆదర్శకంగా నిలిచారు. యువతరానికి స్ఫూర్తినిచ్చే సందేశాలిస్తూ, అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కేటీఆర్. తాజాగా కేటీఆర్‌కు అభిమానిగా మారినట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి అనే యువకుడు విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తూ కేటీఆర్‌ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకునేందుకు కేటీఆర్ ముఖచిత్రాన్ని తన గుండెలపై టాటూగా వేయించుకున్నాడు.

నెల్లూరు జిల్లాకు చెందిన రేహిత్ కుమార్ తెలంగాణలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ 17 రోజులుగా విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తూ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. తనది ఏపీ రాష్ట్రం అయినప్పటికీ.. రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న అభివృద్ధి తేడాను గమనించానని.. రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్బుతంగా ఉన్నాయని కేటీఆర్‌కు రోహిత్ వివరించాడు.

తన కోసం వచ్చిన రోహిత్‌ను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నాడు. గుండెల నిండా అభిమానం పెంచుకున్న రోహిత్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించాలన్న రోహిత్ విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

- Advertisement -