వేణుమాధవ్ బతికే ఉన్నారు.. చంపేయకండి..!

580
rakesh
- Advertisement -

టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్యం మరింత విషమించిన విషయం తెలిసిందే. లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనను మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వేణుమాధవ్‌ ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే మరింత క్షీణించిందని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. వేణుమాధవ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, కోమాలోకి వెళ్లారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

comedian-venumdhav

అయితే ఈ నేపథ్యంలో వేణు మాధ‌వ్‌కి చికిత్స జ‌రుగుతుండ‌గానే, సోష‌ల్ మీడియాలో మాత్రం ఆయ‌న చ‌నిపోయాడంటూ నివాళులు అర్పిస్తున్నారు. కొంద‌రైతే ఏకంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏడుపు సాంగ్స్ యాడ్ చేసి మ‌రి వేణు మాధ‌వ్ మృతిని క‌న్‌ఫాం చేస్తున్నారు.

వేణుమాధవ్ చనిపోయారంటూ వచ్చిన వార్తలపై తాజాగా‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ స్పందించారు. వేణుమాధవ్ బతికే ఉన్నారని, ట్రీట్‌మెంట్‌కు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. తాను హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడనని వెల్లడించారు. దీనికి సంబధించిన రాకింగ్‌ రాకేష్ తన ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేశారు.

- Advertisement -