ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: వాద్రా

4
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో నేను పవర్ సెంటర్ కావడం భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు రాబర్ట్ వాద్రా. శంషాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వాద్రా..నా భార్య ప్రియాంక వయనాడ్ నుండి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తన భార్యకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్య గా మారిందని..నా భార్య, నా కూతురు భద్రత విషయంలో అప్పుడప్పుడు ఆందోళనగా అనిపిస్తుందన్నారు.

భూమిపై నడవాలంటే నా భార్య, కూతురితో సహా దేశంలోని మహిళలందరూ భద్రతగా ఫీల్ అయ్యే రోజుకి రావాలన్నారు. మహిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పాలని..రాహుల్ గాంధీ, నేను ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాం అన్నారు. దేశంలోని సమస్యలను నేను, రాహుల్ ఒకే కోణంలో చూస్తున్నాం అన్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని.. అది మరో ఐదేళ్ల తర్వాత ప్రజలు మార్పు చూస్తారు అన్నారు. తాను ఆధ్యాత్మిక భావనతోనే హైదరాబాద్ వచ్చాను అని చెప్పారు వాద్రా.

Also Read:శంషాబాద్‌లో బిగ్ ఎయిర్‌బస్..

- Advertisement -