ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుత సీజన్లో ఆడిన మొదటి నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించిన రాయల్స్, ఐదో మ్యాచ్లో ఓటమిని చవిచూశారు. ఏప్రిల్ 13న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన పోరులో రాజస్థాన్ ఓడిపోయింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 216 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం ఛేదనలో రాజస్థాన్ను 159 పరుగులకే పరిమితం చేసింది. దీంతో హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజంటేషన్ వేడుకలో రియాన్ పరాగ్ తన జట్టు ప్రదర్శన గురించి మాట్లాడారు. ఈ ఓటమిని ఒక చిన్న పొరపాటుగా భావిస్తున్నామని, దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా తదుపరి మ్యాచ్పై దృష్టి పెడతామని ఆయన చెప్పారు.
“నిజం చెప్పాలంటే, భావోద్వేగాలకు గురయ్యేంత సమయం మాకు లేదు. మేము వరుసగా వికెట్లు కోల్పోయాము, వారు బౌలింగ్ చేసిన తీరుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. బహుశా మా వైపు నుండి కొన్ని లెక్కలు తప్పి ఉండవచ్చు, కానీ మేము దీనిని ఒక చిన్న విఘాతంగా భావిస్తాము తప్ప దీని గురించి అతిగా ఆలోచించము,” అని పరాగ్ పేర్కొన్నారు.
టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ ఎంచుకోవడంపై పరాగ్ వివరణ ఇస్తూ, హైదరాబాద్ బౌలర్లు ప్రాఫుల్ హింగే మరియు సాకిబ్ హుస్సేన్లపై ప్రశంసలు కురిపించారు. వీరిద్దరూ చెరో నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఈ ఓటమిని మర్చిపోయి కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో జరగబోయే తదుపరి పోరు కోసం సిద్ధమవుతోంది.
Also Read:‘డెకాయిట్’..మంచి సినిమా తీశాం!

