మోడీని భూతవైద్యుడంటున్న వర్మ…..

283
RGV
- Advertisement -

రాంగోపాల్‌ వర్మ వివాదాలకు మారు పేరు. ఎప్పుడు ఏదో ఒక ట్వీట్‌ చేస్తు వార్తల్లో ఉంటాడు. వార్త ఏదైన సరై దాంట్లో మనోడు ఏలు పెట్టంది ఉండడు. మొన్నటి వరకు మెగాఫ్యామిలీని ట్వీట్టర్‌ వేదికగా ఒక ఆట ఆడేసుకున్న వర్మ  తాజాగా తమిళనాడు రాజకీయాలపై స్పందించాడు.

సోషల్‌ మీడియా ద్వారా తమిళనాడు రాజకీయాలపై బాంబు పేల్చారు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ . జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని పన్నీర్‌ సెల్వం నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నరేంద్రమోడీ భూతవైద్యుడవుతారా.? అంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు రామ్‌గోపాల్‌ వర్మ.  ‘జయలలిత ఆత్మ, పన్నీర్‌సెల్వంతో మాట్లాడిందట.. నరేంద్రమోడీ ఇప్పుడు భూతవైద్యుడిలా మారతారా.?’ అంటూ వర్మ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది.

RGV says Tamil Nadu

గత రాత్రి పన్నీర్ సెల్వం జయ సమాధి వద్ద దాదాపు 45నిమిషాల పాటు మౌనదీక్ష చేసారు. ఆతర్వాతనే అమ్మ ఆత్మ తనతో మాట్లాడిందని తెలిపాడు, ఏది ఏమైనప్పటికీ తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తమిళనాడు రాజకీయాలను తెర వెనక నుంచి మోడీ ప్రభుత్వం నడిపిస్తుందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -