రంగస్ధలం…ఆర్జీవీ రివ్యూ

240
RGV Praises Rangasthalam Movie
- Advertisement -

మెగా హీరో రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. మార్చి 30న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో వసూళ్ల సత్తాచాటుతుంది. రామ్‌చరణ్ తొలిసారి భిన్నపాత్రలో నటించడం, పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌తో దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు సాధారణ ప్రేక్షకుడిని సైతం కట్టిపడేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను రాబట్టి చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.

పలువురు సినీ ప్రముఖులతో సినీ క్రిటిక్‌లు సైతం రంగస్థలం సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ…రంగస్థలం సినిమాపై ప్రశంసలు గుప్పించారు. రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించారని కొనియాడిన వర్మ … రంగస్థలం సినిమా చక్కటి విజయం(సెంటర్‌ స్టేజ్‌ బుల్లెట్‌ అచీవ్‌మెంట్)‌. రామ్‌చరణ్‌ మైండ్‌ బ్లోయింగ్‌, అద్భుతం.. హే సుకుమార్ ఇదిగో నీకు నా మూడు నమస్కారాలు (ఎమోజీలు) .. మూడు ముద్దులు (ఎమోజీలు) ట్వీట్‌లో పేర్కొన్నారు.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు,ఎన్టీఆర్‌ …రంగస్ధలం టీమ్‌పై ప్రశంసలు గుప్పించారు. ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఎన్టీఆర్ హ్యాట్సాఫ్ అంటూ పేర్కొనగా నా ప్రియమిత్రుడు చాలా సంతోషంగా ఉంటారని భావిస్తున్నానని మోహన్ బాబు ట్వీట్ చేశారు. వీరితో పాటు రకుల్‌ప్రీత్ సింగ్‌, రాజ్‌తరుణ్‌ కూడా ట్వీట్‌ చేశారు. మనకు నచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. మీరు అద్భుతంగా అనుకునే సినిమా రంగస్థలం .. చాలా నచ్చింది. రంగస్థలంలోకి మమ్మల్ని తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు సుకుమార్ అంటూ రకుల్ ట్వీట్ చేయగా రాత్రి ‘రంగస్థలం’ సినిమాను చూశాను. అద్భుతమైన చిత్రం. చిత్ర బృందానికి హ్యాట్సాఫ్‌ అని రాజ్ తరుణ్ పేర్కొన్నాడు.

- Advertisement -