కేసీఆర్…అందరివాడు:ఆర్జీవీ

444
rgv tiger kcr
- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం టైగర్ కేసీఆర్. టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటను వర్మ స్వయంగా పాడి వినిపించిన సంగతి తెలిసిందే. మా ముఖాల మీద ఊసినవ్.. తాట తీయనికే వస్తున్నా.. అంటూ ఆంధ్రులని ఉద్దేశించి ఆర్జీవీ పాడిన పాట వివాదస్పదంగా మారింది.

ఈ నేపథ్యంలో స్పందించిన వర్మ,…కేసీఆర్ అందరివాడని ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్రజలకు కేసీఆర్ వ్యతిరేకం కాదని తెలుగు ప్రజల మధ్య విద్వేశాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది లీడర్లకు మాత్రమే వ్యతిరేకమని ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలంటే కేసీఆర్‌కు అమితమైన ప్రేమ అని ట్వీట్ చేసిన వర్మ …తెలంగాణ ప్రజల మధ్య విద్వేశాలు సృష్టిస్తున్న నాయకులపైనే కేసీఆర్ యుద్దం అని పేర్కొన్నారు.

తాను తెరక్కించబోయే టైగర్ కేసీఆర్ చిత్రంలో ఆంధ్రోళ్ళని విలన్లుగా చూపించడం లేదని వర్మ క్లారిటీ ఇచ్చాడు. తెలంగాణ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొని ఉందన్నారు. తన చిత్రంలో ఆంధ్ర ప్రజలు విలన్లు కాదని… కొంతమంది ఆంధ్రోళ్లు కోట్లాదిమంది ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని మాత్రం చూపిస్తానని వర్మ తెలిపాడు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టైగర్ కేసీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.

- Advertisement -