కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి..

176
Revanth Reddy Join Congress
- Advertisement -

టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. రేవంత్‌ని రాహుల్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ తో పాటు టీడీపీకి గుడ్ బై చెప్పిన   వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు, జంగయ్య, బిల్యా నాయక్, రమేష్ రెడ్డి, శశికళ తదితరులు హస్తం కండువా కప్పుకున్నారు.

రేవంత్ తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు చాలా మంది హస్తం పార్టీలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. సైకిల్ పార్టీకి రాజీనామా చేసిన జిల్లా అధ్యక్షుల్లో సుభాష్‌రెడ్డి (కామారెడ్డి), బిల్యా నాయక్‌ (నల్లగొండ), పటేల్‌ రమేష్ రెడ్డి (సూర్యాపేట), సీహెచ్‌ విజయ రమణరావు (పెద్దపల్లి), సోయం బాబూరావు (ఆదిలాబాద్‌), బోడ జనార్దన్‌ (మంచిర్యాల), తోటకూర జంగయ్య యాదవ్‌ (మేడ్చల్‌) ఉన్నారు. నిజామాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన ఇతర నేతలు కూడా భారీగా రేవంత్ వెంట కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం.

- Advertisement -