తుపానుపై అప్రమత్తంగా ఉండండి:రేవంత్ రెడ్డి

35
- Advertisement -

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పలు ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోయే అవకాశం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోందని, ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని…లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఎక్కడికక్కడ రైతులకు అండగా నిలిచి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్ష సూచన ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు.

Also Read:త్రికోణాసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -