టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుకు సీఎం రేవంత్ ఫోన్

12
- Advertisement -

ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి….టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఏపీలో ఘన విజయం సాధించినందుకు విషెస్ చెప్పారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాలు కొన‌సాగాల‌ని రేవంత్ ఆకాంక్షించారు. విభ‌జ‌న అంశాల ప‌రిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబును రేవంత్ రెడ్డి కోరారు.

టీడీపీ 135, జ‌న‌సేన 21, వైఎస్సార్‌సీపీ 11, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఇక కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో కీలకం కానుంది కాంగ్రెస్. అధిష్టానం అనుమ‌తిస్తే చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్తాన‌ని రేవంత్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read:Sajjala:సజ్జల రాజీనామా..

- Advertisement -