Revanth Reddy: ఢిల్లీ బానిసలు.. !

39
- Advertisement -

ఆత్మగౌరవానికి తెలంగాణ ప్రతీక. ప్రాణం పోయిన ఒకరికి తలవంచని నైజం.. నమ్మితే గుండెల్లో గుడికట్టుకొని పూజించే నిస్వార్థత.. ఈ క్వాలిటీస్ తెలంగాణ ప్రజల్లో ఇన్ బిల్ట్ గా ఉండేవి. మరి ఇలాంటి ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దొరల కాళ్ళ దగ్గర ఉంచే నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అంటే ముమ్మాటికి లేదనే చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి మరియు బీజేపీ తరపున బండి సంజయ్ లను ఢిల్లీ బానిసలుగా ప్రజలు గుర్తిస్తున్నారు. తెలంగాణలో పుట్టి పెరిగిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు… వారి ప్రసంగాల్లో ఏనాడైన జై తెలంగాణ అన్నారా ? అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. .

నిత్యం ఢిల్లీ పెద్దల పల్లకి మోస్తూ వారికి భజన చేస్తూ జై మోడీ, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ అంటారే తప్పా.. పుట్టి పెరిగిన గడ్డకు విలువనిచ్చేలా ఏనాడైన ” జై తెలంగాణ ” అన్న దాఖలాలు ఉన్నాయా అంటే ఏమాత్రం లేవని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ప్రసంగాలతో ఇట్టే అర్థమవుతుంది. ఆ మధ్య ఏకంగా అమిత్ షా కాళ్ళకు చెప్పులు తొడిగి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ దొరల పదాల వద్ద ఉంచిన బండి సంజయ్ వైఖరి.. ఇప్పటికీ కూడా ప్రజలు చీదరించుకునే పరిస్థితి.

ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే వైఖరి కొనసాగిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు భజన చేస్తూ తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇలాంటి నేతలకు అధికారమిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ దొరల చేతిలో పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీకి తలొగ్గకుండా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దేశంలో చిరస్థాయిగా నిలిపేలా కేంద్రంతో కోట్లాడి రాష్ట్రానికి సాధించిన కే‌సి‌ఆర్ కు.. డిల్లీ దొరల వద్ద బానిసత్వం చేసే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు బంగారానికి.. కాకి బంగారానికి ఉన్నంత తేడా ఉందనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం ఎన్నికల వేల కల్లబొల్లి కబుర్లు చెబుతూ తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలలోని ఢిల్లీ బానిసలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది వాస్తవం.

Also Read:CM KCR:సంగారెడ్డికి మెట్రో తీసుకొస్తాం

- Advertisement -