జియో వినియోగదారులకు ఇకపై డేటా ఉచితం..!

224
- Advertisement -

టెలికాం రంగంలో కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో వినియెగ‌దారుల‌ను అట్రాక్ట్ చేస్తుంది రిల‌య‌న్స్ జియో సంస్ధ‌. త‌క్కువ ధ‌ర‌కే ఇంట‌ర్ నెట్ ఇవ్వ‌డంతో పాటు కొత్త కొత్త ప్లాన్ ల‌ను విడుద‌ల చేస్తున్నారు. దీంతో టెలికం రంగంలో ప్ర‌స్తుతం జియో టాప్ నెంబ‌ర్ 1 లో కొన‌సాగుతుంది. ఇక తాజాగా మ‌రో ప్లాన్ ప్ర‌వేశ పెట్టి జియో వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది జియో సంస్ధ‌. జియో తన అన్ని రకాల ప్లాన్లలో ఉచిత డేటా పరంగా మార్పులు చేసింది.

Reliance Jio

రూ.299 లో ఇప్పటి వరకు రోజూ 3జీబీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేయగా, ఇకపై అదనంగా ప్రతి రోజూ 1.5 జీబీ డేటాను పొందొచ్చు. అంటే మొత్తం మీద ప్రతి రోజూ 4.5 జీబీ డేటా చొప్పున 28 రోజుల పాటు సేవలు పొందొచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో ప్రకటించింది. ఇక ఈ ప్లాన్ లో ఉచితంగా అపరిమిత కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లను కూడా ఉచితంగా పొందొచ్చు.

రిలయన్స్ జియోలో రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లలో ప్రస్తుతం ప్రతి రోజూ 1.5 జీబీ లభిస్తుండగా, ఇకపై రోజూ 3జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు. రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్లలో 2జీబీ డేటాకు బదులు 3.5 జీబీ డేటాను రోజూ పొందొచ్చు. అలాగే, ప్రతి రోజూ 4జీబీ డేటాతో కూడిన రూ.509 ప్లాన్ లో ఇకపై ప్రతి రోజూ 5.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.799తో కూడిన 5జీబీ డేటా ప్యాక్ లో రోజూ 6.5 జీబీ డేటాను పొందొచ్చు.

- Advertisement -