- Advertisement -
టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. సుదీర్ఘ వ్యాలిడిటీతో డేటా కావాలనుకునే యూజర్ల కోసం రూ.2,878, రూ.2,998 ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ రెండు కేవలం డేటా ప్యాక్స్ మాత్రమే.
ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిని ఉద్దేశించి జియో వీటిని ప్రవేశపెట్టింది. జియో కొత్తగా తీసుకొచ్చిన రూ.2878 ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 730జీబీ డేటా దక్కుతుంది.
జియో రూ.2998 ప్లాన్ను తీసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5జీబీ డేటా దక్కుతుంది. అంటే మొత్తంగా ఈ ప్లాన్తో 912.5జీబీ డేటా లభిస్తుంది. రోజులో 2.5జీబీ డేటా అయిపోతే స్పీడ్ 64కేబీఎస్కు తగ్గుతుంది. ఇది కూడా డేటా ప్యాక్ కావడంతో కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు.
- Advertisement -