గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన రేగా కాంతారావు

480
rega kantharao
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఎంపీ భానోత్ కవిత పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి , గ్రీన్ ఛాలెంజ్ చెయ్యడంతో అందులో భాగంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇవాళ భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు లోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఐదు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ ఇచ్చారు.

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు,కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు కు గ్రీన్ చాలెంజ్ ఇచ్చారు. వీరు కూడా మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ చేయాలని అన్నారు.

green

పినపాక నియోజకవర్గం లోని టిఆర్ఎస్ యువజన నాయకులను రోజు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి మిగతా యువకులకు చాలెంజ్ విసిరి ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎంతో విజయవంతమైందని ప్రతి పల్లెలో ప్రతి వాడలో పచ్చదనం వస్తుందని గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇంకా పచ్చదనం చిగురిస్తోందని ఆయన అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ విసిరిన సంతోష్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -