ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని పునర్‌ నిర్మించాలి..

281
osmania hospital
- Advertisement -

ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిన్న కురిసిన వర్షాల వలన జలమయం కావడం అందులో చికిత్స పొందుతున్న రోగులకు అందులో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.శిధిలావస్థకు చేరుకున్న భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని గతంలోనే టీఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించడం జరిగింది.కాని కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకొని కోర్టులను ఆశ్రయించడంతో కోర్టు నిర్ణయాన్ని గౌరవించి ప్రభుత్వ నిర్ణయం అమలు ఆలస్యం అవుతున్నది అని భావిస్తున్నాం.ప్రజల సంక్షేమం ను దృష్టిలో ఉంచుకొని అందరం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సహకరించాల్సిన అవసరం ఉంది.

ఉస్మానియ ఆసుపత్రి ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులకు పురుడు పోసింది. నిరుపేద కుటుంబాలకు భరోసానిచ్చింది. ఉద్యమకారులకు జీవితాలను ప్రసాదించింది. తెలంగాణ ఉద్యమంలో గాయపడిన ఉద్యమకారులకు సేవలందించింది. ఉస్మానియాలో భావితరాలకు సేవలందే విధంగా ఆ భవనాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారుల యొక్క జ్ఞాపకాలు ఉస్మానియ ఆసుపత్రిలో నిగూఢమై ఉన్నాయి. ప్రజల అవసరాల దృష్ట్య బడుగు బలహీన వర్గాలకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం, ఉస్మానియా దవాఖాన నిర్మాణం వెంటనే చేపట్టాలి.కారం రవిందర్ రెడ్డి, అధ్యక్షులు, మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి, బి.రేచల్, సహ అధ్యక్షురాలు, రామినేని శ్రీనివాసరావు, టీఎన్జవో కేంద్రసంఘం.ముజీబ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, దేవెందర్, హైదరాబాదు జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు.

- Advertisement -