టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..

99
rcb
- Advertisement -

ఐపీఎల్‌లో భాగంగా నేడు కీలక జట్ల మధ్య పోరు జరగనుంది. పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్ -రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు ఒక మార్పు చేసింది. అనుజ్ రావత్ స్థానంలో రజత్ పటిదార్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక రాజస్తాన్ రాయల్స్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మెకాయ్ ని తప్పించి అతడి స్థానంలో కుల్దీప్ సేన్ ను తీసుకుంది. అలాగే కరుణ్ నాయర్ స్థానంలో డారిల్ మిచెల్‌ను జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు..

రాయల్ చాలెంజ్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, హసరంగా, హేజల్ వుడ్, సిరాజ్

రాజస్తాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, రియాన్ పరాగ్ , డారెల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్

- Advertisement -