రెపోరేటు పెంచిన ఆర్బీఐ

118
rbi
- Advertisement -

ద్యవ్యపరపతి విధానాల సమీక్షలో భాగంగా రెపోరేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది.50 బేసిస్ పాయింట్లు పెంచ‌డంతో.. రెపో రేటు 5.4 శాతానికి చేరిన‌ట్లు శ‌క్తికాంత్‌దాస్ వెల్ల‌డించారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపు చేసేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్లడించారు శక్తికాంతదాస్.

బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చే వ‌డ్డీల‌ను రెపో రేటుగా పిలుస్తారు. రెపో రేటు పెంచ‌డం అంటే, ఇక క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు, లేదా వ్య‌క్తుల‌కు రుణాలు తీసుకోవ‌డం భారంగా మారుతుంది. రెపో రేటును పెంచ‌డం వ‌రుస‌గా ఇది మూడ‌వ‌సారి.

- Advertisement -