ఉర్జిత్‌ పటేల్‌ ఏమయ్యారు…!

188
- Advertisement -

పెద్దనోట్ల రద్దు వల్ల దేశం మొత్తం అతలకుతలంమైంది. నల్లకుబేరులు తమ దగ్గరవున్న బ్లాక్‌మనినీ ఏంచేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నోట్ల రద్దు ప్రభావం చిల్లర లేకపోవడంతో సామాన్యులపై కూడా పడింది.దీంతో సామాన్యులు కొంచెం ఇబ్బందికి గురవుతున్నారు. అయినప్పటీకి మోడీ చేసింది ఒక మంచి పని అనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

దేశంలో రూ. 500, వెయ్యినోట్లు రద్దుచేసి దాదాపు 15 రోజుల కావస్తుంది. కొత్త రూ.2000నోటుకు చిల్లర దోరకకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈచిల్లర కష్టాలు తీరాలంటే కొత్త రూ.500నోట్లు రావాలి. కొన్ని రాష్టాల్లో ఇప్పటికే కొత్త రూ.500నోటు అందుబాటులోకి వచ్చిది. కాని మన తెలుగురాష్టాలకు రావడానికి కొంచెం సమయం పడుతుందని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులతో తీవ్రంగా చిరాకు పడుతున్న నెటిజన్లు ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకపడుతున్నారు. అసలు
ఆర్బీఐ గవర్నర్‌ ఏం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉర్జిత్‌ కనిపించడం లేదంటూ సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తీవ్రంగా హల్‌చల్‌ చేస్తోంది.

RBI Governor Urjit Patel missing

పెద్దనోట్ల రద్దుపై అనంతరం ఉర్జిత్‌ మీడియాలో కనిపించకపోవడాన్ని తప్పుబడుతూ.. ‘మిస్సింగ్‌.. మీరు ఉర్జిత్‌ను చూశారా’ అంటూ ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఉర్జిత్‌ ఫొటో పెట్టి.. ‘ఉర్జిత్‌ పటేల్‌, వయస్సు 53 ఏళ్లు. చివరిసారిగా ఆర్బీఐ భవనం వద్ద కనిపించాడు. అన్నింటినీ క్షమించేశాం. దయచేసి ఇంటికి రా. ఎవరైనా ఆచూకీ చెబితే రివార్డు ఇస్తాం. దయచేసి 01123710538 నంబర్‌కు కాల్‌ చేయండి’ అంటూ మధు మీనన్‌ చేసిన ట్వీట్‌ ఆనతికాలంలో వైరల్‌ అయింది. బహుశా తాను చేసిన పెద్ద పొరపాటుకు చింతిస్తూ ఉర్జిత్‌ ఆత్మహత్య చేసుకొని ఉండి ఉంటాడని నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ బాధ్యత వహించాలన్న డిమాండ్‌ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలిండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్‌ ఉర్జిత్‌ను పదవి నుంచి పీకేయాలని డిమాండ్‌ చేసింది.

- Advertisement -