200 నోట్‌ వచ్చేస్తుంది…

203
RBI clears proposal to introduce Rs200 notes
- Advertisement -

నోట్ల కొరతను దృష్టిలో పెట్టుకుని.. కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది RBI. జాతీయ పత్రిక ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. కేంద్రం ఆమోద ముద్రవేస్తే.. అతి త్వరలో నోట్ల ప్రింటింగ్ ను ప్రారంభిస్తామంటున్నారు RBI అధికారులు. 2017, జూన్ తర్వాత నుంచి వీటి ముద్రణ ప్రారంభం కానుందని రిజర్వ్ బ్యాంక్ అధికారుల సమాచారం. మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు అధికారులు.

అయితే నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా.. అవి అనుకున్నంత మేరకు లేకపోవడం, చిన్న నోట్ల కొరత కొనసాగుతుండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అంతేకాదు.. మార్చి నెలలో ఫీల్డ్ వర్క్ చేసిందట RBI. 10 రూపాయల నోటును ప్లాస్టిక్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. అధికారికంగా మాత్రం వీటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు రిజర్వ్ బ్యాంక్. రూ.200 నోటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2వేల నోటు రద్దవుతుందా అనే విషయంపైనా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

క‌రెన్సీ నోట్ల‌తో త‌ర‌చూ మార్పులు, చిన్న నోట్లు ప్ర‌వేశ‌పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే ఈ కొత్త 200 నోటు తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం వంద‌, 500, 2000 నోట్లు మార్కెట్‌లో ఉన్నాయి. గ‌తంలో ఎన్న‌డూ 200 నోటు ముద్రించిన దాఖ‌లాలు లేవు. ప్ర‌భుత్వం కూడా ఆమోదం తెలిపితే.. 2000 నోటులాగే 200 కూడా అరంగేట్రం చేయ‌నుంది.

- Advertisement -