రవితేజ అందుకే మాట్లాడలేదా?

168
- Advertisement -

నిన్న వాల్తేరు వీరయ్య కి సంబంధించి గ్రాండ్ గా సెట్ లో ప్రెస్ మీట్ పెట్టుకున్నారు యూనిట్. చిరంజీవి, రవితేజ హాజరు కానున్నారనే న్యూస్ ముందే తెలియడం సినిమా మీడియా అంతా హాజరైంది. అయితే మీడియా కూడా ఊహించని విధంగా టీమ్ అందరూ మాట్లాడటం, ఒక్కొక్కరు పది నుండి పది హేను నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా డైరెక్టర్ బాబీ అయితే ఇకపై మరో ఈవెంట్ లేదన్నట్టు గానే లెంతీ స్పీచ్ ఇచ్చాడు.

ఇక ఒక్కొక్కరి స్పీచ్ లు వింటూ ప్రెస్ మీట్ లో రవితేజ కాస్త బోర్ ఫీలయినట్టు కనిపించాడు. ఇక చివరిలో చిరంజీవి కూడా పెద్ద స్పీచ్ ఇస్తారని భావించిన రవితేజ తను కూడా ఓ పది నిమిషాలు మాట్లాడితే చూసే జనాలకి కూడా బోర్ కొడుతుందని భావించినట్టున్నాడు. అందుకే సుముఖంగా స్పీచ్ ఇవ్వకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను చెప్పలనుకున్నది చెప్తా అంటూ మైక్ తిరిగి ఇచ్చేశాడు. కొందరు మాత్రం చిరంజీవి ని పక్కన పెట్టుకొని రవి తేజ ఏమి మాట్లాడకపోవడం కరెక్ట్ కాదని కాస్త యాటిట్యూడ్ చూపించాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైనా ప్రెస్ మీట్ లో అందరూ సినిమా గురించి చాలా చెప్పారు. ఇక రవి తేజ కూడా మాట్లాడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మజా ఉండదు. సో ఇప్పుడు స్కిప్ కొట్టినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా మెగా అభిమానం చూపించుకునేలా మంచి స్పీచ్ ఇవ్వడం ఖాయమనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి…

పవన్ 3 పెళ్లిళ్ల పై బాలయ్య స్పందన!

2022…ఫీల్‌ గుడ్ మూవీస్‌

ఆమె స్థానంలో ఝాన్సీ, ఉదయభాను

- Advertisement -