అంధురాలిగా రష్మిక… మిషన్ మజ్ను

267
- Advertisement -

ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందానా. సౌత్‌లోని అగ్ర కథానాయికలలో ఒకరిగా ఎదిగి స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. అల్లు అర్జున్‌తో చేసిన పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు గుర్తింపు లభించింది. దీంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక…బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌తో గుడ్‌బై సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిపోయింది. దాంతో గ్రాండ్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇద్దామని అనుకున్న సాధ్యం కాలేదు.

ప్రస్తుతం రష్మిక మిషన్ మజ్ను చిత్రంపైనే ఆశలు పెంచుకుంది. సిద్దార్థ్‌ మల్హోత్రా హీరోగా నటించిన ఈ మూవీ… స్పై యాక్షన్ జొనర్‌లో తెరకెక్కింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజై సినిమాపై విపరీతమైన అచనాలను పెంచేసింది. దీంతో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయడంలేదు. కానీ ఈ సినిమాను వచ్చే యేడాది జనవరి 20న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఈ సినిమాలో రష్మిక అంధురాలి పాత్రలో నటించిందని బాలీవుడ్‌లో టాక్.

రష్మిక ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందనే నమ్మకంతో చాలానే రీసెర్చ్‌ చేసిందట. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ఒకింత నిరాశ కనబరిచిన క్రష్మిక మాత్రం బాలీవుడ్ ఆశలన్నీ మిషన్ మజ్నుపై పెట్టుకుంది. ప్రస్తుతం రష్మిక యానిమల్‌ సినిమా సినిమా చేస్తుంది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ హీరోగా నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

యూరప్‌లో వాల్తేరు వీరయ్య

విడాకుల భర్తగా రవితేజ ?

శబరిగా వరలక్ష్మీ శరత్‌కుమార్

- Advertisement -