‘టిక్ టాక్’కి బానిసైన స్టార్‌ హీరోయిన్‌..!

539
- Advertisement -

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ప్రతి రోజు పండగే”. ఇటివలే ఈ చిత్ర యూనిట్ న్యూయార్క్‌లో కీలకమైన షెడ్యూల్‌ ను పూర్తి చేసింది, దాంతో ఈ సినిమాకి సంబంధించి చిన్న ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఇందులో సాయిధరమ్ తేజ్‌కు జంటగా రాశి ఖన్నా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రాశిఖన్నా పాత్ర కడుపుబ్బ నవ్విస్తుందని సినీ వర్గాల సమాచారం.

Sai-Dharam

ఈ చిత్రంలో ఈ అమ్మడు ‘టిక్ టాక్’కి బానిసైన ఆమె ఎప్పుడు చూసినా వీడియోలు చేస్తూ వుంటుందట. అలా ఆమె చేసే ‘టిక్ టాక్’ వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయని అంటున్నారు. ‘సుప్రీమ్’ సినిమాలో బెల్లంకొండ శ్రీదేవిగా కామెడీని పండించిన రాశి ఖన్నా, ఆ తరువాత చేస్తున్న హాస్యభరిత పాత్ర ఇదేనని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో సత్యరాజ్ తేజుకు తాత పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 20వ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -