రాశీఖన్నా క్రష్‌ ఎవరో తెలుసా?

36
- Advertisement -

ఈ తరం కథానాయికల్లో రాశీ ఖన్నాఒకరు. ఊహలు గుసగుసలాడే’తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన రాఖీఖ‌న్నా కెరీర్‌లో అద్భుత‌మైన పాత్ర‌లు పోషించింది. ఊహాలు గుస‌గుసలాడే చిత్రంలో సాయి శిరీష ప్రభావతిగా న‌టించగా, ఈ పాత్ర ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.ఇక ‘ప్రతిరోజూ పండగే’లో టిక్‌టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన రాశీ.. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రతి పాత్రలోనూ కాస్త హాస్యాన్ని జోడించి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అందం, అభినయం ఈ రెండూ కలిగిన సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్‌గా రాణిస్తోంది. రాశీ ఖన్నా అందానికి ముగ్దులవ్వని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చూస్తూనే ఉండాలనిపించే అందం.. కుర్రకారు గుండెలను బాంబుల్లా పేలుస్తోంది అనే చెప్పాలి. రష్మిక తమ క్రష్‌ అని చాలా మంది చెబుతుంటారు.. అయితే రష్మిక క్రష్‌ ఎవరు అనేది ఓ ఆసక్తికరమైన ప్రశ్న.. ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానమిచ్చింది ఈ మద్దుగుమ్మ. తన క్రష్‌ ఎవరో చెప్పి తన అభిమానులకు షాకిచ్చింది ఈ భామ.

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌ గా ఆహా వేదికగా దిగ్విజయంగా ప్రసారమవుతున్న అన్‌ స్టాపబుల్‌ 2 షో ఏ మేరకు ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుందో మనందరికి తెలిసిందే. ఈ షోలో బాలకృష్ణ తన చమత్కార మాటలు, హావభావాలతో, కొంటె ప్రశ్నలతో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తున్నారో తెలిసిందే. అయితే తాజాగా ఈ షోలో ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ షోలో పాల్గొన్నారు. అందులో ఇద్దరు అలనాటి స్టార్‌ హీరోయిన్‌ లు అయితే మరొకరు ప్రస్తుతుం యూత్‌ గుండెల్లో గూడుకున్న రాశీఖన్నా.. ఈ ముగ్గురు అన్‌ స్టాపబుల్‌ షోలో సందడి చేశారు. అయితే ఇందులో భాగంగా హోస్ట్ బాలకృష్ణ రాశీ ఖన్నాను తన క్రష్‌ ఎవరని అడగగా.. వెంటనే రాశీఖన్నా ఏమాత్రం తడుముకోకుండా విజయ్‌దేవరకొండ అని చెప్పేసింది. అయితే మొత్తానికి బాలకృష్ణ షో వేదికగా రాశీఖన్నా క్రష్‌ ఎవరో తెలిపోయింది.

- Advertisement -