ముంబై చేరుకున్న దీప్ వీర్ దంప‌తులు..

210
deepveer
- Advertisement -

బాలీవుడ్ జంట దీపికా ప‌దుకునే, ర‌ణ్ వీర్ సింగ్ లు ఇటివ‌లే ఇట‌లీలో వివాహం చేరుకున్న విష‌యం తెలిసిందే. కొంత మంది ప్ర‌ముఖుల మ‌ధ్య‌లో సింధి, కొంకణి సంప్రదాయాల్లో వీరు వివాహం చేసుకున్నారు. ఉద‌యం దీప్ వీర్ జంట ముంబైకి చేరుకున్నారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పొర్టుకు చేరుకున్నారు. షేర్వాణీపై ఎరుపు రంగు జాకెట్ ధరించిన రణ్ వీర్, బంగారు వర్ణంలో ఉన్న సిల్క్ పంజాబీ సూట్ ను దీపిక ధరించారు.

deepveer

అక్క‌డ ఉన్న అధికారులు, అభిమానుల‌తో కాసేపు స‌ర‌దాగా గ‌డిపి సెల్ఫీలు దిగారు. ఈనెల 14, 15తేదీల్లో వీరి వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. కాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు.

- Advertisement -