రానా తేజ కాంబోలో మరో సినిమా..!

21
- Advertisement -

టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి మరియు తేజ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా రానున్నట్టు టాలీవుడ్‌లో టాక్‌. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌ హిట్‌ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రావడం పట్ల రానా అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు. జోగేంద్ర పాత్రకు మించిన పవర్‌ ఫుల్‌ రోల్‌ను తేజ సిద్ధం చేశారని ఇన్ సైడ్ టాక్‌.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాను గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మలయాళ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు రానా టీం వెలువరించనున్నట్టు టాలీవుడ్‌లో గుసగుసలు. మరీ ఈ సారి రానాను ఎలా చూపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటికి రానా సోదరుడు అభిరామ్ హీరోగా అహింస అనే సినిమాను తేజ తెరకెక్కించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ కి క్రేజీ అప్ డేట్స్

- Advertisement -