Ramoji Rao:ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

5
- Advertisement -

రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో స్మృతి వనంలో ఆయన కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రామోజీరావు పాడే మోయగా ఆయన్ని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, నామా నాగేశ్వరరావు, అరికపూడి గాంధీ, బీజేపీ ఎంపీలు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఏపీ నాయకులు సుజనా చౌదరి, రఘురామ కృష్ణరాజు, దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు.

Also Read:11న అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

- Advertisement -