టేకాఫ్ అయిన 30సెకన్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో విమానం కూలిపోయింది అని తెలిపాడు గుజరాత్ విమాన ప్రమాదంలో మరణించిన రమేష్ విశ్వాస్. మీడియాతో మాట్లాడిన రమేష్..తాను స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ మృతదేహాలున్నాయి. విమానం ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి అని చెప్పారు.
టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో కూలిపోయిందని తెలిపారు. తనను ఎవరో అంబులెన్స్లో ఎక్కించారని…నా సోదరుడు కూడా విమానంలో తనతో ప్రయాణించాడని చెప్పారు.
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8(డ్రీమ్లైనర్స్)లో 11ఏ సీటు ఎకానమీ క్లాస్ క్యాబిన్కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్ క్లాస్కి వెనుక ఉంటుంది. క్యాబిన్కి అభిముఖంగా కూర్చుని చూస్తే ఎడమ వైపున 11ఏ సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి రెండు వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాలలో సురక్షిత సీటుగా పరిగణించే 11ఏ సీటు ఎమర్జెన్సీ డోర్కు వెనుకనే ఉంటుంది.
Also Read:క్షతగాత్రులను పరామర్శించిన మోదీ..

