పాపం రామ్..మరో వినయ విధేయ రామే

32
- Advertisement -

ఒక హిట్ వస్తే బోయపాటికి పూనకం వస్తోంది. నరకుడు మోతాదు పెంచుకుంటూ పోతాడు. అఖండ విజయం ఫలితమే ఇప్పుడు స్కంద‌కి ప్రతికూలం కాబోతుంది. రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న స్కంద‌ సినిమా గురించి ఓ విషయం తెలిసింది. సినిమాలో హీరో నరకుడు మరీ ఎక్కువ అయ్యింది, అసలు సెకండ్ హాఫ్ లో హీరో రామ్ ఎందుకు నరుకుతున్నాడో ?, ఎవర్ని నరుకుతున్నాడో కూడా తెలియకుండా నరుక్కుంటూ పోయాడట. ఇదెక్కడి గోలరా బాబు ? అనుకునేలా సినిమా సాగింది అని టాక్ నడుస్తోంది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ కానుంది. ఆ రోజు కోసం రామ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

కానీ, ఆల్రెడీ ఈ సినిమా చూసిన రామ్ మాత్రం బాగా నిరాశకి గురి అయ్యాడు. అనవసరంగా బోయ‌పాటి శ్రీనును ఎక్కువ నమ్మేశాను అని రామ్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి సినిమా షూటింగ్ సమయంలో బోయ‌పాటి శ్రీనుకి రామ్ ఓవర్ యాక్షన్ వద్దు అని రిక్వెస్ట్ చేశాడు. కానీ, అఖండ మోజులో పడిపోయిన బోయ‌పాటి శ్రీను అవేం పట్టించుకోలేదు. అసలు ఒక సినిమా ఫేమస్ అవ్వడానికి, సినిమాని హిట్ కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో కొంత మంది దర్శకులు నిజ జీవితానికి దగ్గరగా తీస్తారు, మరి కొందరు దర్శకులు సమాజంలో ఎక్కడో జరిగే ఒక ఎక్స్ట్రీమ్ పరిస్థితి ని చూపించి ప్రపంచం అంతా ఇంతే ఉందా ? అన్న భావన కలిగేలా తీస్తారు. బోయపాటి స్కంద‌ సినిమా విషయంలో ఈ రెండు నియమాలను పాటించలేదు.

Also Read:మైనంపల్లికి దారులు మూసుకుపోతున్నాయా?

ముందు నుంచి బోయ‌పాటి శ్రీను సినిమాలు బాగా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. అసలు ఇంత యాక్షన్ పెట్టడం నిజంగా అవసరామా ? అన్న భావన కలుగుతుంది. ఆ కోవలోకే ఈ “స్కంద‌ సినిమా” సినిమా కూడా వచ్చేలా ఉంది. ఈ సినిమాతో ఒక దర్శకుడిగా తన స్థాయిని బాగా తగ్గించుకునేలా ఉన్నాడు బోయపాటి. సినిమా కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా, సాగితినే బోయపాటి అతని భరించగలం. ఆ పరిస్థితి లేనప్పుడు.. మరో వినయ విధేయ రామే అవుతుంది. పాపం రామ్.. స్కంద‌తో భారీ మూల్యం చెలించుకోబోతున్నాడు.

Also Read:దేశంలో థర్డ్ ఫ్రంట్.. అధిపతిగా కే‌సి‌ఆర్?

- Advertisement -