జూలై 12 నుంచి డ‌బుల్ ఇస్మార్ట్

47
- Advertisement -

బోయ‌పాటితో స్కంద సినిమా చేస్తున్న రామ్ పోతినేని, త‌ర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ తో డ‌బుల్ ఇస్మార్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. స‌న్నిహితుల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు సంబంధించిన పూజ జులై 9న జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది. జులై 12 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. రూ.40 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను ఛార్మీ కౌర్ పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌లో నిర్మిస్తోంది. అయితే, బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేదు అన్నట్టు లైగర్ సినిమా పరిస్థితి ఇంకా అలాగే ఉంది.

కొందరు బయ్యర్లు పూరిని ఇప్పట్లో వదిలేలా లేరు. లైగర్ సినిమా వ‌సూళ్లు సాధించ‌లేద‌ని ఇప్పటికే డిస్ట్రిబ్యూట‌ర్స్ పెద్ద గొడ‌వే చేశారు. పూరి ఇంటి పై దాడి చేస్తాం అని బెదిరించారు. ఓ దశలో పూరికి మళ్లీ సినిమా రావడం కూడా కష్టమే అని లెక్కలు మాట్లాడారు. కానీ, ఎట్టకేలకు ఎనర్జిటిక్ హీరో రామ్ తో పూరి మరో సినిమా సెట్ చేసుకున్నాడు. ఎలాగూ ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. అందుకే ఇస్మార్ట్ శంకర్ కే సీక్వెల్ ను తీస్తున్నారు.

Also Read:Zuckerberg:11 ఏళ్ల తర్వాత ట్విట్టర్‌లోకి

నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరికి సరైన హిట్ లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ హిట్, ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. అందుకే, పూరి – రామ్ కలయికలో రాబోతున్న ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్, గతంలో పిలిచి సినిమా చేస్తా అని పూరికి మాట ఇచ్చాడు. కానీ, లైగర్ ప్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. కానీ, రామ్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read:‘సలార్’ టీజర్ ఉదయాన్నే ఎందుకు?

- Advertisement -