గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఆర్జీవీ..

100
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు. జర్నలిస్ట్‌ స్వప్నతో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతనరం తనదైనశైలిలో స్పందించారు. తనకు పచ్చదనం అంటే నచ్చదని, బురద అంటే అస్సలు గిట్టదని వర్మ పేర్కొన్నారు.

వర్మతో కలిసి మొక్కలు నాటిన ఫొటోలను జర్నలిస్ట్ స్వప్న ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, “నా అసంతృప్తి” అంటూ వర్మ కామెంట్ పెట్టారు. మొత్తానికి ఆర్జీవీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్‌ ఛాలెంజ్ నిర్విఘ్నంగా ముందుకుసాగుతోంది. కరోనా సంక్షోభ సమయంలోనూ సెలెబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.

- Advertisement -