క్యూట్ వీడియో షేర్ చేసిన చెర్రీ..!

315
ram charan
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూట్ వీడియోని షేర్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఈ వీడియోలో త‌న మేన‌కోడ‌ళ్లు కూర‌గాయ‌ల‌ను శుభ్రం చేసి ఆర‌బోశారో చూపించారు. ఎందుక‌లా చేశార‌ని వారిని చ‌ర‌ణ్ అడ‌గ్గా క్రిములు పోయేలా ముందు కూర‌గాయ‌ల‌ను స‌బ్బు నీటితో క‌డిగి త‌ర్వాత సాధార‌ణ నీళ్ల‌తో క‌డిగామ‌ని వారు బ‌దులిచ్చారు. త‌న మేన‌కోడ‌ళ్లు కూర‌గాయ‌ల‌ను చ‌క్క‌గా శుభ్రం చేశార‌ని, ఎంతో బాధ్య‌త ఉన్న పిల్ల‌ల‌ని రామ్‌చ‌ర‌ణ్ వీడియోలో పిల్ల‌ల‌ను అప్రిషియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్….రాజమళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు. 2021 జనవరి 8న సినిమా విడుదల కానుంది. ఓ వైపు హీరోగా మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు.

- Advertisement -