ఆర్సీ 15…ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

97
rc
- Advertisement -

శంకర్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్‌కు ఇది 15వ సినిమా కాగా చెర్రీ సరసన కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు.

నవంబర్ 2తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కానుండగా ఈ షెడ్యూల్ లో చరణ్, ఫైటర్స్‌పై యాక్షన్‌తో కూడిన పోరాట సన్నివేశాన్ని చిత్ర బృందం రూపొందించింది. అలాగే చరణ్‌తో పాటు హీరోయిన్ కియారా అద్వానీపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. కొంత విరామం తర్వాత టీమ్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.

170 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు.

- Advertisement -